Published On: Sun, Jun 1st, 2014

ఆన్ లైన్ లోనే మహిళల ఫిర్యాదులు..

Share This
Tags

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్కడి మహిళల భద్రత కోసం మరో అడుగుముందుకేసింది. మహిళలు తమకేదైనా సమస్యలు ఎదురైతే పోలీస్ స్టేషన్ దాకా వెళ్లే పనిలేకుండా ఆన్ లైన్ లోనే ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం ఓ వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ సైట్ ప్రారంభించి పదిరోజులైనా కాకుండా, అశేష సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. దాంతో ఫోన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. కాకపోతే బాధితులు తప్పనిసరిగా తమ ఫోటో పంపాలి. వీడియో రూపంలో ఫిర్యాదు చేసి అప్ లోడ్ చేయాలి. ఈ ఫిర్యాదును వారి వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఫిర్యాదులోని అంశాలను నిర్ధారణ చేసుకున్నాకే కేసుకు సంబంధించి ముందడుగు వేస్తారు.

About the Author