న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిబల్
తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తానని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. న్యాయశాఖ మంత్రిగా ఆయన సోమవారం అదనపు బాధ్యతను స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయశాఖ అధికారులు సిబల్కు స్వాగతం పలికారు. తనకీ బాధ్యత అప్పగించిన ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిబల్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేదని…పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాల్సి ఉందని సిబల్ అన్నారు.