Published On: Tue, Mar 19th, 2013

భారత్ వెళ్తున్నారా.. మృగాళ్లుంటారు జాగ్రత్త!

Share This
Tags

‘భారత్ వెళ్తున్నారా? మృగాళ్లుంటారు జాగ్రత్త!’ అంటూ బ్రిటన్ తన దేశ మహిళలను హెచ్చరించింది. భారత్ అత్యాచారాల అడ్డాగా మారిందని, ఈ నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటించాలని కోరింది. ఈ మేరకు ఫారిన్, కామన్‌వెల్త్ ఆఫీస్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. విదేశీ మహిళలపై భారత్‌లో జరుగుతున్న అత్యాచారాలను ఆయన ఉటంకించారు. బీచ్‌లు, నిర్జన ప్రదేశాల్లో సాధ్యమైనంత మేరకు సంచరించకుండా ఉంటే మంచిదని బ్రిటన్ మహిళలకు తమ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు.

About the Author