Published On: Thu, Mar 7th, 2013

ఇక ఆధార్‌తో ‘ఉపాధి’ వేతనాలు

Share This
Tags

ఉపాధిహామీ పథకం కూలీలందరికీ మే నుంచి వేతనాలను ఆధార్ కార్డుతో అనుసంధానించి బ్యాంకుల ద్వారా చెల్లించాలని ‘రాష్ట్ర ఉపాధి హామీ మండలి’ నిర్ణయించింది. బుధవారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించాలని నిర్ణయించినట్లు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి మాణిక్యవరప్రసాద్ చెప్పారు. కొత్తగా 23 పనులను ఈ పథకంలో చేర్చామని, ఏప్రిల్ నుంచి వేతనం రోజుకు రూ. 149 పెంచుతున్నట్లు చెప్పారు.

About the Author