జగనన్న ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న జగనన్న సైన్యం…..
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రడ్డి అధికారం చేపట్టి ఏడాది కావస్తుంది. అసలు జగన్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నవరత్నాలు సజావుగా ప్మరజలకు చేరువ కావడానికి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న జగన్నన్న సైన్యం అయిన గ్రామ వాలంటీర్ లు ముఖ్యభూమిక పోషిస్తున్నారు… . ప్రజలతో మమేకమై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాలను ఈ గ్రామ వాలంటీర్ లు ఎలా ముందుకు తీసుకు వెళ్తున్నారనే ఈ అంశాలపై అంశంపై ప్రత్యేక పల్సెస్ వారి ఈ రాష్ట్రం డాట్ కాం ప్రత్యేక కథనం.
తండ్రి తలపెట్టిన పథకాలను పక్కాగా అమలు చెయ్యడం. కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులో తేవడం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రథాన్ని కదం తొక్కించే తీరు, దేశంలోనే అపూర్వం. అనితర సాధ్యం అనిపిస్తుంది. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఊహించని సంక్షేమ శకం నడిచింది. దేశంలో ఎవరూ ఊహించనన్ని సంక్షేమ పథకాలతో ప్రజలకు జీవితమే ఒక పండగ, రైతులకు వ్యవసాయం పండగ, విద్యార్థులకు పెద్ద చదువుల పండగ.