జగనన్న రాజ్యంలో మహిళలకు చేయూత ….
తండ్రి తలపెట్టిన పథకాలను పక్కాగా అమలు చెయ్యడం. కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులో తేవడం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రథాన్ని కదం తొక్కించే తీరు, దేశంలోనే అపూర్వం. అనితర సాధ్యం అనిపిస్తుంది. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఊహించని సంక్షేమ శకం నడిచింది. దేశంలో ఎవరూ ఊహించనన్ని సంక్షేమ పథకాలతో ప్రజలకు జీవితమే ఒక పండగ, రైతులకు వ్యవసాయం పండగ, విద్యార్థులకు పెద్ద చదువుల పండగ. ఈ అంశాలపై అంశంపై ప్రత్యేక పల్సెస్ వారి ఈ రాష్ట్రం డాట్ కాం ప్రత్యేక కథనం.
జగన్ ప్రచారానికి ప్రజలు జేజేలు పలికారు. ఆయన మాట తప్పరు అన నమ్మకంతో ఓటుతో ప్రతిస్పందించారు. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశారు. అంతే. మళ్లీ ఇన్నేళ్లకు రాజన్న రాజ్యం వచ్చిందంటూ ఇప్పుడు నవ్యాంధ్ర ప్రజలు సంబరపడుతున్నారు.