Published On: Sun, Mar 24th, 2013

చరిత్ర సృష్టించిన ధోని సేన

Share This
Tags

టెస్టు క్రికెట్ లో టీమిండియా సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. షిరోజ్ షా కోట్లా మైదానంలో చిరస్మరణీయ విజయంతో కంగారూలను ధోని సేన మట్టి కరిపించింది. గతేడాది ఆసీస్ గడ్డపై జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. దిగ్గజాలు చెప్పినట్టే మ్యాచ్ ను మూడు రోజుల్లోనే ముగించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 4-0 తేడాతో గెల్చుకుంది. చివరి టెస్టులో ఆసీస్ ను ఆరు వికెట్లతో ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. కాంగారూలకు వైట్ వాష్ చేసింది. ఆసీస్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ధోని సేన 31.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అధిగమించింది. పూజారా(82) అజేయ అర్థ సెంచరీతో రాణించాడు.

రవీంద్ర జడేజా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అందుకున్నాడు.

About the Author