Published On: Sun, Mar 31st, 2013

ఆ 25 సూత్రాల అమలు తప్పనిసరి: డీజీపీ

Share This
Tags

పోలీసుశాఖను పటిష్టపరిచేందుకు రూపొందించిన 25 సూత్రాలను పోలీస్‌స్టేషన్ల వారీగా తప్పనిసరిగా అమలుచేయాలంటూ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లకు డీజీపీ వి.దినేష్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని పోలీస్ కో-ఆర్డినేషన్ విభాగం అదనపు డీజీ వినయ్‌కుమార్‌సింగ్  మీడియాకు వెల్లడించారు. మూడు నెలల కిందట చేపట్టిన ఈ ప్రక్రియను మరో మూడు నెలల్లో పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేయదగ్గ ప్రతి ఫిర్యాదుపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ప్రతి సోమవారం పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి ఎస్పీ వరకూ ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు.

About the Author